ఎస్ఐ మోసం చేశాడంటూ యువతి నిరసన .. నిజామాబాద్ ​డివిజన్​లో ఘటన

ఎస్ఐ మోసం చేశాడంటూ యువతి నిరసన .. నిజామాబాద్ ​డివిజన్​లో ఘటన
  • ఆఫీస్ ​సిమ్​ అప్పజెప్పి లీవ్​లో వెళ్లిన ఎస్ఐ

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ ​డివిజన్​పరిధిలోని ఓ  యువతి స్టేషన్​లో బైటాయించిన ఘటన జిల్లా పోలీస్​ శాఖలో చర్చనీయాంశమైంది. యువతిని స్టేషన్​లోని సిబ్బంది సముదాయించి పంపగా, అదే అదునుగా భావించిన ఎస్ఐ ఆఫీస్ ​సిమ్ ​కార్డును ఠాణాలో అప్పగించి సోమవారం సడన్​ లీవ్​లో వెళ్లారు.

పెండ్లి పేరుతో మోసం చేసిన అతడికి ఇదివరకే భార్యాపిల్లలు ఉన్నారని తెలిసిన యువతి, ఆదివారం రాత్రి అతడు పనిచేస్తున్న ఠాణాకు వచ్చి కూర్చుంది. న్యాయం కావాలని పట్టుబట్టిన ఆమెను స్టేషన్​సిబ్బంది ఉదయం మాట్లాడదామని చెప్పి పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ యువతికి దొరకొద్దనే ఆలోచనతో సడన్ ​లీవ్​లో వెళ్లిపోయారు. విషయాన్ని సీరియస్​గా తీసుకున్న సీపీ కల్మేశ్వర్​ విచారణకు ఆదేశించారు.

Also Read : ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం