- ముస్లింల డిమాండ్
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో పశుమాసం మార్కెట్ వద్ద అపరిశుభ్ర గో మాంసం విక్రయాలు చేస్తున్నారని వెంటనే విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ముస్లింలు సోమవారం తహసీల్దార్ తారాబాయి, జీపీ సెక్రటరీ ప్రేమ్దాస్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పశుమాంసం మార్కెట్ వద్ద అపరిశుభ్రమైన గోమాంసాన్ని విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.
ఆర్టీసీ బస్షెల్టర్, మండల సముదాయం, ప్రభుత్వ బాలికల హైస్కూల్, కూరగాయాల సంతకు వచ్చే వందలాది మంది ప్రజలు, ప్రయాణికులు పశు మార్కెట్ దారిగుండా వెళ్తుంటారని, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపసర్పంచ్ నిస్సార్, నాయకులు నజీర్, గులాబ్, మజీద్, మజీద్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
