- నాలుగేండ్ల కింద యువతి,ఆమె తల్లిపై కత్తితో దాడి
- కన్నుమూసిన తల్లి
మియాపూర్, వెలుగు : ప్రేమించిన యువతి దూరం పెడుతోందని, తన నంబర్ బ్లాక్ చేసిందని, వేరేవాళ్లను పెండ్లి చేసుకుంటోందనే కక్షతో ఓ వ్యక్తి ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపైనా అటాక్చేశాడు. తర్వాత గొంతు కోసుకున్నాడు. ఈ ఘటనలో తల్లి చనిపోగా హాస్పిటల్లో చేరిన యువకుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. అయితే ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా 12వ అడిషనల్సెషన్స్జడ్జి టి.అనిత సంచలన తీర్పు ఇచ్చారు. మరో కేసులో పదేండ్ల జైలు వేశారు.
గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర ఇసుకపల్లికి చెందిన శోభ కూతురు వైభవి(19), ఇదే గ్రామానికే చెందిన సందీప్(25) ప్రేమించుకున్నారు. సందీప్కూలీ కావడంతో వైభవి పేరెంట్స్ఒప్పుకోలేదు. దీంతో వైభవి సందీప్ను దూరం పెట్టింది. ఫోన్నంబర్లను బ్లాక్ చేసింది. మాట్లాడకపోతే చస్తానని బెదిరించడంతో హైదరాబాద్లో ఉండే తన అన్న గోవర్ధన్వద్దకు తల్లితో కలిసి వచ్చింది.
న్యూ హఫీజ్పేట్లోని ఆదిత్యనగర్లో ఉండేవారు. వైభవికి వరుసకు మామ అయ్యే వ్యక్తితో పెండ్లి చేయాలని నిర్ణయించుకోగా, విషయం తెలుసుకున్న సందీప్2022 డిసెంబర్13న గోవర్ధన్ఇంటికి వచ్చి వైభవి, శోభతో గొడవపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. తర్వాత గొంతు కోసుకున్నాడు. శోభ తీవ్ర గాయాలతో చనిపోయింది. ఈ కేసులో విచారణ తర్వాత గురువారం తీర్పు వెలువరించారు.
