కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి వల్లే…. కల్వకుర్తి పంప్ హౌజ్ మునిగిపోయింది

కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి వల్లే…. కల్వకుర్తి పంప్ హౌజ్ మునిగిపోయింది

కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి వల్లే…. కల్వకుర్తి పంప్ హౌజ్ మునిగిపోయిందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ. పంప్ హౌజ్ ను ఓపెన్ గ్రౌండ్ లో చేపట్టాలని నిపుణుల కమిటీ సూచించిందన్నారు. కానీ కమీషన్లకు కక్తుర్తి పడి అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టారన్నారు. పాలమూరు ప్రజలంటే కేసీఆర్ కు వివక్ష ఎందుకని ప్రశ్నించారు డీకే అరుణ. కృష్ణానదిపై కట్టిన ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు.

కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులు సాధించుకోవడానికి అనేక ఉద్యమాలు, పాదయాత్రలు, ఆమరణ నిరాహారదీక్షలతో పోరాడి ఈ ప్రాజెక్టులను పూర్తిచేశామన్నారు.  ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 8లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని సంకల్పించామని.. తెలంగాణ ఏర్పాటు నాటికే ఈ ప్రాజెక్టుల పనులు 80శాతానికి పైగా పూర్తయ్యాయని తెలిపారు. మరో రూ.2వేల కోట్ల నుంచి రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తే ..ఈ ప్రాజెక్టులు పూర్తయి, వందకు వంద శాతం నీటిని అందించే అవకాశం ఉండేదన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పథకాలపై నిర్లక్ష్యం చేసిందని తెలిపారు డీకే అరుణ.