గవర్నర్​తో డీకే అరుణ భేటీ

గవర్నర్​తో డీకే అరుణ భేటీ

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేగా తన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయించాలని గవర్నర్ తమిళిసైని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ కోరారు. ఈసీ తనను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా ప్రమాణ స్వీకారానికి స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ లు ఏర్పాట్లు చేయడం లేద న్నారు. శుక్రవారం ఆమె రాజ్ భవన్​లో గవర్నర్‌‌ని కలిసి వినతిపత్రం అందజే శారు. 

అనంతరం అరుణ మాట్లాడు తూ.. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసిందని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఈ నెల 2న కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసిందన్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కోరేందుకు స్పీకర్,  సెక్రటరీని కలవడానికి అసెంబ్లీకి రెండుసార్లు వెళ్లినా.. వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ విషయంపై స్పీకర్​తో మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు అరుణ తెలిపారు.