సీఎం కేసీఆర్ ను గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. కేసీఆర్ ఖాసిం రజ్వీ కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. కేసీఆర్ వ్యవహార శైలి తాలిబన్ల లాగ ఉందని బీజేపీ నేత జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. బండి సంజయ్ కోసం బెయిల్ పిటిషన్ వేయబోమన్న ఆయన.. ప్రభుత్వమే బేషరతుగా సంజయ్ ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరసన సభలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. బండి సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు.
. @BJP4Telangana అధ్యక్షులు @bandisanjay_bjp గారి అక్రమ అరెస్టుకు నిరసనగా, మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలపడం జరిగింది.
— D K Aruna (@aruna_dk) January 4, 2022
ప్రజా శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమే. అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపినంత మాత్రాన మా పోరాటం ఆగదు. pic.twitter.com/MT5BnElp49