
గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ అనే కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఫోన్లో ఇంటర్నెట్ లేకున్నా ఏఐ మోడల్స్ను ఉపయోగించుకోవచ్చు.
ఇంటర్నెట్ లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇమేజ్లను క్రియేట్ చేస్తుంది. కోడ్ రాస్తుంది. ప్రశ్నలు అడిగితే సమాధానం ఇస్తుంది. దీని పనితీరు చాలా వేగంగా ఉంటుంది. అంతేకాదు.. యూజర్ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది కలుగదు. దానికి కారణం యూజర్ల నుంచి వచ్చే డేటా క్లౌడ్ సర్వర్లకు వెళ్లదు. ఆ డేటా మొత్తం మొబైల్ ఫోన్లో బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది.
ఇది సెక్యురిటీ రిస్క్ను తగ్గిస్తుంది. ఈ యాప్ gemma 31బీ అరు లాంగ్వేజ్ మోడల్పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది పెద్ద మొత్తంలో టెక్స్ట్ను క్షణాల్లో జనరేట్ చేయగలదు. గెమ్మా సైజ్ చిన్నగా ఉన్నప్పటికీ కంటెంట్ క్రియేట్ చేయడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్మార్ట్ రిప్లయ్ ఇవ్వడంలో చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఈ యాప్ ఓపెన్ సోర్స్లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఐఓఎస్ వెర్షన్ని కూడా విడుదల చేయనున్నట్టు గూగుల్ తెలిపింది.