
ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్నూ బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ''దో బారా'' (2:12) అనే మర్డర్ మిస్టరీ డ్రామాలో నటిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శోభా కపూర్, ఏక్తా కపూర్, సునీత్ ఖేత్రపాల్, గౌరవ్ బోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగష్టు 19న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'దో బారా' ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆధ్యంతం ఉత్కంఠ రేపుతోంది. ఇది హారర్ చిత్రంగా ఉండబోతుందని తెలుస్తోంది.
ఇందులో తాప్సి తో పాటుగా నాజర్, పవలి గులాటి, రాహుల్ భట్, తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. 'దో బారా' చిత్రాన్ని 2018లో వచ్చిన 'మిరేజ్' అనే స్పానిష్ మూవీకి రీమేక్ గా తెరకెక్కించారని తెలుస్తోంది. 'మన్మర్జియాన్' మరియు 'సాంద్ కీ ఆంఖ్' వంటి సినిమాల తర్వాత అనురాగ్ కశ్యప్ - తాప్సీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలున్నాయి.