కరోనా బారినుంచి డాక్టర్‌ను కాపాడే ప్రయత్నం విఫలం

కరోనా బారినుంచి డాక్టర్‌ను కాపాడే ప్రయత్నం విఫలం

ఇండోర్ : కరోనా మహమ్మరి ఇండోర్ లో ఓ డాక్టర్ ను బలితీసుకుంది. ఇటీవలే కరోనా పాజిటివ్ గా తేలటంతో ఇండోర్ లోని ఎంజీఎం హాస్పిటల్ లో ఆయనను ఐసీయూ లో చేర్చారు. కరోనా బారి నుంచి డాక్టర్ ను కాపాడేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. గురువారం డాక్టర్ మృతి చెందినట్లు మధ్య ప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్క ఇండోర్ లో కరోనా తో చనిపోయిన వారి సంఖ్య 22 కు చేరింది. రాష్ట్రంలో అత్యధిక కేసులు ఇండోర్ లో నమోదు అవుతున్నాయి. బుధవారం నాటికి రాష్ట్రంలో 229 కేసులు నమోదైతే ఇండోర్ లోనే 213 మంది కరోనా బారిన పడ్డారు. ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో ఇండోర్ ను కరోనా హాట్ స్పాట్ గా ప్రకటించారు.