
ఓయూ, వెలుగు: మతిస్థిమితం లేని బాలికపై వైద్యుడు లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి తెలిపిన ప్రకారం.. బాలిక నాలుగు నెలలుగా హబ్సిగూడలోని వైబ్రెన్ట్ వింగ్స్ లో డాక్టర్ రంజిత్ వద్ద వైద్యం తీసుకుంటోంది. చికిత్సకు వెళ్లిన ప్రతీసారి పాపకు గాయాలు ఉండటాన్ని తల్లి గమనించింది. లైంగిక దాడికి పాల్పడట్లు గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.