తెలంగాణ బిల్లు పోరాటంపై డాక్యుమెంటరీ

తెలంగాణ బిల్లు పోరాటంపై డాక్యుమెంటరీ
  • మధుయాష్కీ నివాసంలో జానారెడ్డి, విజయశాంతి, 
  • పొన్నం, కేకే, గుత్తా భేటీ


హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా తెలంగాణ ఎంపీలు చేసిన పోరాటాలపై డాక్యుమెంటరీ రూపొందించాలని ఉదమ కాలం నాటి ఎంపీలు నిర్ణయించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని మాజీ ఎంపీ మధుయాష్కీ నివాసంలో పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ఎంపీలు విజయశాంతి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, కేకే, గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశమై డాక్యుమెంటరీపై చర్చించారు. బిల్లు పాస్ అవ్వడంలో అప్పటి కాంగ్రెస్  ఎంపీల పాత్ర కీలకం అని,  సోనియా గాంధీ చొరవ భావితరాలకు తెలియాలని డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు మాజీ ఎంపీ మధుయాష్కీ తెలిపారు. మీటింగ్ అనంతరం మధుయాష్కీ మీడియాతో మాట్లాడారు.  

ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్​లో తెలంగాణ బిల్లు పాస్ అయిందని, ఈ ఆర్టికల్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఎంపీగా ఉన్న కేసీఆర్ పార్లమెంట్​లో మాట్లాడలేదని, విజయశాంతి తెలంగాణ కోసం మాట్లాడి, పోరాటం చేశారని గుర్తుచేశారు. బిల్లు పాస్ అవ్వడంలో అప్పటి కాంగ్రెస్  ఎంపీల   పాత్ర కీలకమని, సోనియాగాంధీ చొరవ భావితరాలకు తెలియాలని డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కమీషన్లతో బతికే వాళ్లకు.. విచారణ కమిషన్​కు.. వసూలు చేసే కమీషన్​కు తేడా ఏం తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. అధికారులు ఇచ్చిన ఆధారాలతోనే కేసీఆర్.. హరీశ్.. ఈటలకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. లిక్కర్​స్కాంలో కవిత  జైలుకు వెళ్లి వచ్చారని, త్వరలోనే ఆమె నాన్న, బావ జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు.