జూలై 1 నుంచి దోస్త్ అడ్మిషన్స్

జూలై 1 నుంచి దోస్త్  అడ్మిషన్స్

హైదరాబాద్: దోస్త్ 2021-22 అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు. యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ సింగిల్ విండో సేవలు అందించనుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 200 చెల్లిస్తే దోస్త్ ఐడీ వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 105 దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ లను ఏర్పాటు చేశారు. జూలై 1 నుంచి 15 వరకు ఫేస్-1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 3 నుంచి 16 వరకు ఫేస్-1 వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చినట్టు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు.