డబుల్ బెడ్రూం ఇండ్లు అప్పగించాలని ఇద్దరి ఆత్మహత్యా యత్నం

డబుల్ బెడ్రూం ఇండ్లు అప్పగించాలని ఇద్దరి ఆత్మహత్యా యత్నం

జూలూరుపాడు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో  తమకు కేటాయించిన డబుల్​ బెడ్రూం ఇండ్లను వెంటనే అప్పగించాలని బుధవారం ఇద్దరు మహిళా లబ్ధిదారులు సర్పంచ్​ ఇంటి ముందు పురుగు మందు తాగారు. వివరాలిలా ఉన్నాయి. తమకు కేటాయించిన ఇండ్లను ఆక్రమించినవారిని తొలగించాలని  సర్పంచ్ బాదావత్​ లక్ష్మి ఇంటి ముందు లబ్ధిదారులు భుక్యా జమిలి,  ధారావత్​ శాంతి, మరికొందరు బైఠాయించారు. ఎంతసేపటికీ  సర్పంచ్​ నుంచి ఎటువంటి  హామీ రాకపోవడంతో​ సహనం కోల్పోయిన జమిలి, శాంతి  పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని స్థానిక పీహెచ్​సీకి  తీసుకెళ్లి చికిత్స అందించారు.  ఎటువంటి ప్రాణహాని లేదని డాక్టర్లు చెప్పారు.  మిగిలిన లబ్ధిదారులను సీఐ వసంత్​ కుమార్, తహసీల్దార్​ శారద ముందు సమావేశ పరిచారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించి, అర్హులైన వారికి ఇండ్లను అప్పగించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.