
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ నుండి మేకర్స్ కీలక ప్రకటన చేశారు. అదేంటంటే ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ మేరకు మేకర్స్ రిలీజ్ డేట్ తో కూడిన కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక పవర్ ఫుల్ రిలీజ్ డేట్ పోస్టర్లో రామ్ పవర్-ప్యాక్డ్ అవతార్లో కనిపిస్తున్నాడు. విభూతి ధరించి కాస్త గంభీరంగా కనిపించాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో ఒక శివలింగం, జ్వాలాఫలకాన్ని కూడా చూడవచ్చు. వాస్తవానికి ఆగస్టు 15వ తేదీన అల్లు అర్జున్ పుష్ప 2 ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అవుతుండటంతో పుష్ప 2 రిలీజ్ డేట్ వాయిదా పడినట్లేనని అర్థం అవుతుంది.
ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. షాయాజీ షిండే, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా చార్మీ కౌర్ తో కలిసి పూరీ జగన్నాధ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.