- 18 నెలల పాటు లీగల్ కన్సల్టెంట్ గా సేవలు
బషీర్బాగ్, వెలుగు: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ బ్యాంక్ ర్యాంప్ (ర్యాంప్) ప్రోగ్రామ్కు అశోక్నగర్కు చెందిన చెందిన న్యాయవాది డాక్టర్ కరణం రాజేశ్ కుమార్ ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ పదవిలో18 నెలల పాటు లీగల్ కన్సల్టెంట్గా భారతదేశంలో ర్యాంప్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్లు, న్యాయ సంబంధిత పత్రాలను క్రోడీకరించి జగదీష్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రపంచ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వానికి ఆయన సేవలు అందిస్తారు. భారత్ తరఫున ప్రపంచ బ్యాంక్కు సేవలు అందించే అవకాశం కల్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంక్కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత అభివృద్ధికి తోడ్పడతానని, తెలంగాణ యువ న్యాయవాదులు అంతర్జాతీయంగా సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ పదవితో భారత ప్రతిష్ఠను మరింత పెంచేలా కృషి చేస్తానని డాక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు.
