శంషాబాద్ లో దిగిన అతిపెద్ద విమానం

శంషాబాద్ లో దిగిన అతిపెద్ద విమానం

హైదరాబాద్ : లేటెస్ట్ మోడల్ విమానం హైదరాబాద్ కు వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో ఎతిహాద్ ఎయిర్ వేస్ కు చెందిన 787-10 డ్రీమ్ లైనర్ సర్వీస్ ఫస్ట్ టైం మన ఎయిర్ పోర్ట్ లో దిగింది. ఈ సూపర్ ఫ్లైట్ రాకతో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో సందడి నెలకొంది. విమానాన్ని చూడటానికి ప్రయాణికులు క్యూ కట్టారు.  ఇది అబుదాబి నుంచి హైదరాబాద్ కు వచ్చింది. 787 సిరీస్ లో 787-10 విమానం లేటెస్ట్ వర్షన్. దీని పొడవు 68 మీ. రెక్కల పొడవు 60 మీ. ఎత్తు 17 మీ. దీనిలో 330 ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

ఈ విమానం ఆగకుండా 11,910 కి.మీ. ప్రయాణించగలదు. ఈ ఫ్లైట్ రావడానికి అరగంట ముందు విమానాశ్రయానికి విమానం గురించి సమాచారం అందింది. అయితే ఎయిర్ పోర్ట్ లో 787-10 విమానం దిగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ ఉండడంతో.. అధికారులు విమానం దిగేందుకు అనుమతి ఇచ్చారు.