![అలర్ట్ : హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్..](https://static.v6velugu.com/uploads/2024/02/drinking-water-shutdown-in-these-areas-of-hyderabad_rJ8icENmyR.jpg)
హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్ జారీ చేసింది జలమండలి. మహా నగరానికి ఒక రోజు తాగునీటిలో సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపింది. సింగూరు ప్రాజెక్టులోని పెద్దాపూర్ పంప్ హౌజ్ దగ్గరున్న 132 కేవీ కంది-పెద్దాపూర్ ఫీడర్ లో TSPDCL పలు కరెంట్ పనులు చేపట్టనుంది. ఈ నిర్వహణ పనులు కోసం ఫిబ్రవరి 22, 2024 తేదిన గురువారం ఉదయం 8 గంటల నుంచి కొన్ని ప్రాంతాల్లో పాక్షిక, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:
- ఓ అండ్ ఎం డివిజన్ - 3 : షేక్ పేట్ రిజర్వాయర్ (పూర్తిగా), భోజగుట్ట (పాక్షిక).
- ఓ అండ్ ఎం డివిజన్ - 6 : బంజారా, ఎర్రగడ్డ రిజర్వాయర్ల ప్రాంతాల్లో (పాక్షిక), బోరబండ రిజర్వాయర్ ప్రాంతాల్లో (పూర్తిగా).
- ఓ అండ్ ఎం డివిజన్ - 9 & 15 : లింగంపల్లి రిజర్వాయర్ ప్రాంతాల్లో, ఆన్ లైన్ సప్లయ్ (పూర్తిగా).
- ఓ అండ్ ఎం డివిజన్ – 18 : ఖానాపూర్ గ్రావిటీ 1200 ఎంఎం మెయిన్ ఆన్ లైన్ సప్లయ్ ప్రాంతాలు (పూర్తిగా)
కావున పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి కోరింది. పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది.