హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్న ఇద్దరు గుజరాతీలు అరెస్ట్

 హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొస్తున్న ఇద్దరు గుజరాతీలు అరెస్ట్
  • 70 గ్రాముల హెరాయిన్ స్వాధీనం

హైదరాబాద్‌, వెలుగు: రాజస్థాన్‌ నుంచి సిటీకి హెరాయిన్ సప్లయ్ చేస్తున్న ఇద్దరు సభ్యుల గ్యాంగ్​ను ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి 70 గ్రాముల హెరాయిన్, వెయింగ్ మెషీన్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుఉన్నారు. గుజరాత్​లోని భావ్​నగర్ జిల్లా తిలక్​నగర్​కు చెందిన పంకజ్ భాయ్(27), ప్రజాపతి ముఖేశ్​లక్ష్మణ్ భాయ్ సిటీకి వచ్చి అంబర్ పేటలో ఉంటున్నారు. డ్రగ్స్ కు బానిసైన వీరిద్దరు సప్లయర్లుగా మారారు.

సిటీలోని తమ బంధువులు, ఫ్రెండ్స్​కు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి హెరాయిన్ కొని హైదరాబాద్​కు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా 70 గ్రాముల హెరాయిన్​కు అమ్మేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న ఎల్​బీనగర్ ఎస్​వోటీ పోలీసులు శుక్రవారం నాగోల్ క్రాస్ రోడ్​లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం నిందితులను నాగోల్ పోలీసులకు అప్పగించారు.