
గండిపేట్, వెలుగు: ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తరలిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఐదు కిలోల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుద్వేల్కు చెందిన డి.జగదీశ్(22), చింతల్మెట్కు చెందిన ఎం.రాముకుమార్(23), బుద్వేల్కు చెందిన బి.మనోజ్(19), బి.నరేందర్(21), మహేశ్ ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్నారు. రాజేంద్రనగర్ పత్తికొండ వద్ద అనుమానితంగా కనిపించడంతో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. మహేశ్ పరారీలో ఉన్నాడు.