
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. శుక్రవారం (మే 30) సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఒకటిన్నర కిలోల హెరాయిన్ను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. నగర శివారు షాద్నగర్లోని ఓ దాబాలో స్మగ్లర్ల ముఠా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు సదరు దాబాపై మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో హెరాయిన్తో పాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.3 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువత జీవితాన్ని చిత్తు చేస్తోన్న మత్తు పదార్ధాలు, డ్రగ్స్ను ఉపేక్షించొద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్ స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు.
►ALSO READ | అక్రమ నిర్మాణాలపై కొరడా..గృహ ప్రవేశం రోజే ఇల్లు నేలమట్టం