తాను శివుడి అవతారం అంటూ.. వృద్ధురాలిని హత్య చేసిండు

తాను శివుడి అవతారం అంటూ.. వృద్ధురాలిని హత్య చేసిండు

ఓ వృద్ధుడు తాను శివుడి అవతారమని నమ్మించి  ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన రాజస్థాన్​లో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఉదయ్​పుర్​జిల్లాకి చెందిన ప్రతాప్​సింగ్​(60) ఫుల్​గా మందు తాగాడు. ఊళ్లో నడిచి వెళ్తుండగా మధ్యలో కల్కీ బాయి(85) అనే వృద్ధురాలు అతనికి కనిపించింది. 

వృద్ధుడు ఆమెతో మాటలు కలిపాడు. ఆమె పక్కనే కూర్చుని తాను శివుడి అవతారమంటూ, ఆమె కోసమే శివుడు తనను పంపాడంటూ నమ్మబలికాడు. ఆమె పూర్వ జన్మలో రాణి అంటూ.. చంపి బతికిస్తా అని వృద్ధురాలితో చెప్పాడు.

వెంటనే ఆమె కడుపులో బలంగా కొట్టాడు. అక్కడే ఉన్న ప్రతాప్​సింగ్​ అతన్ని నిలువరించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కింద పడిన వృద్ధురాలి తలపై తన చేతిలో ఉన్న గొడుగుతో కొట్టాడు. 

తీవ్ర గాయాలైన కల్కీ బాయి అక్కడికక్కడే మృతి చెందింది. సంబంధిత ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనలో నిందితులుగా ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. 

అయితే ఆ వృద్ధురాలు మంత్రగత్తె అనే అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. పోలీసులు వదంతులను ఖండించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.