- తప్పతాగి కారుతో వీరంగం
- రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలు తుక్కుతుక్కు
ఎల్బీనగర్, వెలుగు: తప్పతాగి హయత్నగర్లో ముగ్గురు వ్యక్తులు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంగా, అడ్డగోలుగా కారు నడిపి రోడ్డు పక్కన పార్క్ చేసి వాహనాలపైకి దూసుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్నగర్కు చెందిన నరేశ్ తన ఫ్రెండ్స్ వెంకటేష్, శివకృష్ణతో కలిసి నగర శివారులో మద్యం సేవించాడు. అనంతరం కారులో తిరిగి వస్తూ.. మద్యం మత్తులో స్టీరింగ్పై నియంత్రణ కోల్పోయాడు.
అతివేగంతో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన రెండు బైకులు, ఒక కారును ఢీకొట్టాడు. ప్రమాద ధాటికి వాహనాలు తుక్కుతుక్కు కాగా, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో హయత్నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో నిందితులు మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్నారు.

