తాగిన మత్తులో రాత్రంతా కారులో ఏసీ ఆన్ చేసుకొని..

తాగిన మత్తులో రాత్రంతా కారులో ఏసీ ఆన్ చేసుకొని..

నోయిడాలోని బరోలాలో విషాధం చోటుచేసుకుంది. రాత్రి కారులో పడుకున్న వ్యక్తి తెల్లారేసరికి శవమయ్యాడు. బరోలాకు చెందిన 30 ఏళ్ల సుందర్ పండిట్ అనే వ్యక్తికి సెక్టార్ 107లో కూడా మరో ఇల్లు ఉంది. సుందర్ ఈ ఇంటికి వారాంతంలో వస్తుంటాడు. అలాగే శనివారం కూడా వచ్చాడు. మధ్యానికి బానిసైన సుందర్.. శనివారం రాత్రి కూడా మధ్యం తాగి ఇంటికి వచ్చాడు. సెల్లార్‌లో కారు పెట్టిన తర్వాత మధ్యం మత్తులో ఏసీ ఆన్ చేసుకొని అందులోనే పడుకున్నాడు. అయితే ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు కారు ఇంజిన్ నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను పీల్చుకోవడంతో సుందర్ కారులోనే మరణించాడు. ఆదివారం ఉదయం సుందర్ సోదరుడు ఈ విషయాన్ని గమనించాడు. వెంటనే సుందర్‌ను స్థానికి ఆస్పత్రికి తరలించాడు. కానీ, అప్పటికే సుందర్ చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. సుందర్ మరణంపై ఆయన కుటుంబసభ్యులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ఒక పోలీస్ అధికారి తెలిపారు. కుటుంబ సభ్యులు సుందర్ యొక్క మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు స్థానిక సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.

For More News..

ఆర్టీసీ రూట్లు ప్రైవేటుకు..