మద్యం మత్తులో యువకుడు వీరంగం: వివాహ వేడుకలో నలుగురికి కత్తి పోట్లు

మద్యం మత్తులో యువకుడు వీరంగం: వివాహ వేడుకలో నలుగురికి కత్తి పోట్లు

 డీసీసీ అధ్యక్షులు సురేష్ బాబు అనుచరులు నలుగురికి కత్తి పోట్లు

చిత్తూరు జిల్లా : కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం పచ్ఛార్లపల్లె గ్రామంలో ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుకలో కర్ణాటక రాష్ట్రం బీమాగాణి హళ్లి గ్రామానికి చెందిన తిమ్మరాజు మద్యం మత్తులో హల్ చల్ చేశారు. ఈ వివాహ వేడుకకు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు హాజరయ్యారు. తమ వాహనానికి ద్వికచక్ర వాహనం రోడ్డుకు అడ్డంగా ఉండడంతో యువకుడిని టూవీలర్ తీయాలని చెప్పారు. దీంతో మద్యం మత్తులో ఉన్న తిమ్మరాజు కోపంతో సురేష్ బాబు అనుచరులపై కీ చైన్ చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు కత్తి పోట్లుకు గురయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుడుపల్లె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది