గవర్నర్ ప్రసంగంలో.. అసెంబ్లీలో ఆకర్షణీయంగా పలువురు శాసనసభ్యులు

గవర్నర్ ప్రసంగంలో.. అసెంబ్లీలో ఆకర్షణీయంగా పలువురు శాసనసభ్యులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ(డిసెంబర్ 15న) గవర్నర్ తమిళిసై ప్రసగించారు. అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ అభినందనలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

మరోవైపు..గవర్నర్ ప్రసంగంలో ఉభయ సభల సమావేశంలో పలువురు శాసనసభ్యులు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. వారిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజుర్ నగర్), పద్మావతి (కోదాడ) దంపతులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ), రాజగోపాల్ రెడ్డి(మునుగోడు) బ్రదర్స్, గడ్డం వినోద్ (బెల్లంపల్లి), వివేక్ వెంకటస్వామి (చెన్నూరు) బ్రదర్స్, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, రాజేష్ రెడ్డి (తండ్రి, తనయుడు) ఉన్నారు. 

ఇటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిలో కేటీఆర్ (సిరిసిల్ల), ఎమ్మెల్సీ కవిత (అన్నా, చెల్లెలు), హరీష్ రావు (సిద్దిపేట), కేటీఆర్ (బావ, బామ్మర్దులు) మల్లారెడ్డి (మేడ్చల్), మర్రి రాజశేఖర్ రెడ్డి (మామ, అల్లుడు) ఉన్నారు.