హైదరాబాద్, వెలుగు: ఈ నెల 28 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బడులకు, జూనియర్ కాలేజీలకు విద్యాశాఖాధికారులు దసరా సెలవులు ప్రకటించారు. స్కూల్ఎడ్యుకేషన్డిపార్ట్మెంట్అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు సెలవులు ఉంటాయని ఆ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఇస్తున్నట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పేర్కొన్నారు. స్కూళ్లు అక్టోబర్ 14న, జూనియర్ కాలేజీలు అక్టోబర్ పదో తేదీన తిరిగి ప్రారంభం కానున్నట్టు అధికారులు ప్రకటించారు. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.