ఏడాది తర్వాత అసెంబ్లీకి ఈటల

ఏడాది తర్వాత అసెంబ్లీకి ఈటల

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ దాదాపు సంవత్సరం తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. పోయిన ఏడాది బడ్జెట్‌ సమావేశాల తర్వాత జూన్‌ 4న టీఆర్‌‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి, హుజూరాబాద్‌​ ఉప ఎన్నికలో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా రెండు సార్లు పనిచేశారు. 2014 నుంచి అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్‌ పార్టీ సీటింగ్‌ వైపు కూర్చున్న ఈటల.. ఇప్పడు బీజేపీ ఎమ్మెల్యేగా విపక్ష నేతల సీటింగ్‌ వైపు కూర్చొనున్నారు.