రవి కుటుంబాన్ని పరామర్శించిన ఈటల, రఘునందన్

రవి కుటుంబాన్ని పరామర్శించిన ఈటల, రఘునందన్

మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ లో నిన్న ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని బిజేపి MLAలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు పరామర్శించారు. కేసీఆర్ కు లెటర్ రాసి రైతు ఆత్మహత్య చేసుకున్నారన్నారు . ఢిల్లీలో రైతుల చనిపోయారని పైసలు ఇస్తామన్న కేసిఆర్.. ఆయన సొంత జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులను కనీసం పట్టించుకోవడం లేదన్నారు. గత ఆంధ్రా పాలకులకు కేసిఆర్ పాలనకు తేడా లేదన్నారు. చంద్రబాబు పాలన... చంద్రశేఖర్ రావు పాలన ఒకటే రకంగా ఉందని విమర్శించారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.