మొత్తం అమ్మి అయినా కేసీఆర్‎ను వదిలిపెట్టకన్నది

మొత్తం అమ్మి అయినా కేసీఆర్‎ను వదిలిపెట్టకన్నది

రాష్ట్రంలో వేస్తున్న రోడ్లన్నింటికి నిధులు కేంద్రం 90 పైసలిస్తే.. రాష్ట్రం 10 పైసలు మాత్రమే ఇస్తుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా చేస్తున్న ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘మీకిచ్చే కేసీఆర్ కిట్‎లో కేంద్రం 5 వేలు ఇస్తుంది. ఈ విషయంలో సోమ్ము ఏమో కేంద్రానిది.. సోకేమో కేసీఆర్‎ది. రైతుల నుంచి వడ్లు కొనేది కేసీఆర్ కాదు. ప్రతి గింజా కేంద్రమే కొంటోంది. మహిళా గ్రూపులకిచ్చే కమీషన్లు, హమాలీలకిచ్చే కమీషన్లు కూడా కేంద్రమే ఇస్తోంది. కేసీఆర్ వడ్లు కొనను అంటున్నాడు. కొనకుండా ఎలా ఉంటావో చూస్తా. ఐకేపీ సెంటర్లు ఉంటాయ్.. వడ్ల కొంటాయ్. నన్ను మధ్యలో వచ్చినవ్.. మధ్యలోనే పోయినవ్ అంటున్నరు. కళ్యాణలక్ష్మి, పెన్షన్ లకు అయ్యే ఖర్చు కన్నా.. లిక్కర్ మీద వచ్చే ఆదాయం ఎక్కువ. కాబట్టి మనం ఆయన మీద బతుకుతలేం. మనమీదే ఆయన బతుకుతున్నడు. కేసీఆర్ నన్ను ఓడగొట్టడానికి చేసే పనులు చూసిన నా భార్య ఒక్కటే చెప్పింది. మొత్తం అమ్మి అయినా ఖర్చు పెట్టు.. కానీ కేసీఆర్‎ను వదిలిపెట్టకు అని చెప్పింది. మీరందరూ పట్టుబడితే.. కేసీఆర్ పార్టీకి ఈ గడ్డ మీద డిపాజిట్ కూడా రాదు’ అని ఈటల రాజేందర్ అన్నారు.

For More News..

సీఎంలకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు

ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా.. లొంగేది లేదు