హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ నోటిఫికేషన్కు రెండు రోజులే ఉన్నందున.. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం టీమ్ బుధవారం రాష్ట్రానికి రానుంది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్కమిషనర్లు నితీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన టీమ్రెండ్రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తారు. సీఎస్, డీజీపీ సహా జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశం కానున్నారు. ఈవీఎంలు, కోడ్ అమలు, ఉల్లంఘనలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు గురించి తెలుసుకుంటారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై ఆరా
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం జరిగిన దాడిపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరా తీసినట్లు తెలిసింది. వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని సీఈఓను ఆదేశించింది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ను సమగ్ర వివరాలు