జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన

త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై స్పష్టత వచ్చింది. ఈ నెల 18 నుండి 20 వ తేదీల మధ్య ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి అన్నారు. ఓటర్ల జాబితాను విడుదల చేసి, రాజకీయ పార్టీల నేతలకు జాబితా అందించామని చెప్పిన ఆయన ఈ నెల 20వ తేదీలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు.

ఎన్ని దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలి, ఏఏ తేదీల్లో నిర్వహణ చెయ్యాలి అనేది దానిపై త్వరలోనే వివరిస్తామని ఆయన అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్ నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.  ఎన్నికలకు 1.8 లక్షల సిబ్బంది అవసరమని, ఆర్వో, వీఆర్వోలకు ఇందుకు సంబంధించి పూర్తి శిక్షణ ఇచ్చామని నాగిరెడ్డి తెలిపారు.