హైదరాబాద్ , వెలుగు: ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందలేదన్న ఫిర్యాదులతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందని వారు వెంటనే ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం ఆర్వోను సంప్రదించాలని స్పష్టం చేసింది.
ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ చూపించి పోస్టల్ బ్యాలెట్ తీసుకోవచ్చని తెలిపింది. ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పేర్కొంది.