హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్కు (ఎంఎస్ఎంఈ) వీలైనంత తోడ్పాటును అందిస్తున్నామని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. సంస్థ సీనియర్ఎగ్జిక్యూటివ్స్ విజయ్ శెట్టి, ప్రశాంత్ హైదరాబాద్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 వేలకు పైగా ఎంఎస్ఎంఈ ఖాతాలకు సేవలు అందిస్తున్నామని, 199 శాఖల ద్వారా కస్టమర్లకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
2026 మార్చి నాటికి ఎంఎస్ఎంఈ లోన్బుక్ విలువ రూ. 2.93 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు. ‘‘చిన్న వ్యాపారాల కోసం డిజిటల్ రుణాలు, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంస్ఎంఈ విభాగంలో మాకు 8.1 శాతం మార్కెట్ వాటా ఉంది. ఎస్బీబీసీ, ఎస్ఎంఈ, మిడ్-కార్పొరేట్ లోన్లు రెండంకెల వృద్ధి సాధించాయి”అని అన్నారు.
