
మూడా (మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చింది ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్).ఈ కేసుకు సంబంధించి రూ.100 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది . ముడా భూకేటాయింపుల్లో మనీలాండరింగ్ సంబంధం ఉందన్న ఆరోపణలతో 92 ఆస్తులను అటాచ్ చేసింది. వీటి విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆయన సతీమణి బీఎం పార్వతి ఈడీ పర్యవేక్షణలో ఉన్నారు. ఈ కేసులో సోమవారం (జూన్ 9) వంద కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు మంగళవారం (జూన్ 10) ఈడీ వెల్లడించింది.
కర్ణాటక లోకాయుక్త FIR ఆధారంగా విచారణ జరుపుతున్న ఈడీ.. ఆస్తులను అటాచ్ చేయడం కీలక పరిణామం. అయితే ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన సతీమణితో పాటు మరో ఇద్దరిపై వచ్చిన ఆరోపణల్లో ఆధారాలు లేనందున ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఈ కేసును అప్పట్లో క్లోజ్ చేసింది. అయితే ఈ కేసులో ముడై సైట్స్ కేటాయింపుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఈడీ ప్రకటనలో పేర్కొంది.
అసలు ఏంటి ముడా స్కామ్..?
సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మ పేరిట ఉన్న కొన్ని భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్అర్బన్డెవలప్మెంట్అథారిటీ (ముడా) సేకరించింది. దానికి ప్రతిఫలంగా ముడా వేరే చోట ఆమెకు భూమి కేటాయించింది. సిద్ధ రామయ్య సీఎంగా ఉన్న సమయంలో ఈ తతంగం అంతా జరిగింది. దీంతో సీఎం సిద్ధ రామయ్య ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సామాజిక కార్యకర్తలు ఈ ఇష్యూపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
►ALSO READ | 2029లో గెలిచేటోళ్లు ఐదేళ్లు సీఎంగా ఉండరా.. : కేంద్రం తీసుకొస్తున్న చట్టం ఏం చెబుతోంది..?
దీంతో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధ రామయ్య, ఆయన సతీమణి పార్వతమ్మ, మరి కొందరిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముడా స్కామ్లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ.. లోకాయుక్త పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉండగానే.. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. న్యాయస్థానం రిజెక్ట్ చేసింది. లేటెస్ట్ గా ఈ కేసులో ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం గమనార్హం.