డ్రగ్స్‌‌ కేసులో రకుల్​కు ఈడీ నోటీసులు

డ్రగ్స్‌‌ కేసులో రకుల్​కు ఈడీ నోటీసులు
  • ఇప్పటికే రెండుసార్లు విచారించిన ఈడీ
  • 19న మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: టాలీవుడ్‌‌‌‌‌‌‌‌  డ్రగ్స్ కేసు మరో సారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నటి రకుల్‌‌‌‌‌‌‌‌ ప్రీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఫతే మైదాన్‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌లోని ఈడీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఉదయం 10.30 గంటలకు  రావాలని పేర్కొన్నారు. 2017లో రాష్ట్ర ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ పోలీసులు నమోదు చేసిన డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కేసు ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులను విచారించింది. ఈ కేసులో రకుల్​కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది మూడోసారి. గత ఏడాది సెప్టెంబరు 6న కూడా విచారణకు నోటీసులు పంపింది. ఆమెకు ముందస్తుగా ఖరారైన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ఉండడంతో హాజరు కాలేదు.