న్యూఢిల్లీ: గతంలో క్రిప్టో ఎక్స్చేంజి వజీర్ ఎక్స్ అకౌంట్లను ఫ్రీజ్ చేసిన ఈడీ , తాజాగా ఈ అకౌంట్లను అన్ఫ్రీజ్ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో వజీర్ ఎక్స్ను ఆపరేట్ చేస్తున్న జన్మాయి ల్యాబ్ ఆస్తులపై ఈ ఏడాది ఆగస్టులో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత వజీర్ ఎక్స్కు చెందిన రూ.64.67 కోట్ల బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ను ఫ్రీజ్ చేసింది. 16 ఫిన్ టెక్ కంపెనీలను, ఇన్స్టెంట్ లోన్ యాప్లను దర్యాప్తు చేయడంలో భాగంగా కంపెనీ వజీర్ ఎక్స్పై ఈ చర్య తీసుకుంది. ఇన్స్టెంట్ లోన్ యాప్స్ కేసులోని కంపెనీలు 10 క్రిప్టోఎక్స్చేంజీల ద్వారా రూ. 1000 కోట్లను మనీలాండరింగ్ చేశాయని ఆరోపించింది.