ఆర్టీసీఈయూ జనరల్ సెక్రటరీగా ఈదురు వెంకన్న

ఆర్టీసీఈయూ జనరల్  సెక్రటరీగా ఈదురు వెంకన్న

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఆర్టీసీఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈదురు వెంకన్న ఎంపికయ్యారు. ఇప్పటివరకూ ఆ పదవిలో కొనసాగిన కే.రాజిరెడ్డి ఇటీవల కాంగ్రెస్​ పార్టీలో చేరారు. దీంతో సంఘం నేతలు ఆయనను ఆర్టీసీఈయూ జనరల్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పించారు. దీనిపై రాజిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ లో చేరడానికి, ప్రధాన కార్యదర్శి పదవికి సంబంధం లేదని ప్రకటనలో తెలిపారు.  మీటింగ్​కు కోరం లేనందునా తన తొలగింపు నిర్ణయం చెల్లదని స్పష్టం చేశారు.