
సమ్మర్ హలీడెస్ తర్వాత అంగన్వాడీ కేంద్రాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాల వద్ద చిన్నారులకు అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు స్వాగతం పలికారు. ఫస్ట్డే చిన్నారులు ఉత్సాహంగా హాజరయ్యారు.
ఇందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్రారంభ దినం సందర్భంగా ప్రత్యేకంగా చిన్నారులకు ‘ఎగ్ బిర్యానీ’ లంచ్లో వడ్డించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ మేరకు అందిస్తున్న ఆహారం, విద్యా సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పలువురి చిన్నారులతో మాట్లాడారు.
ఇటీవల అంగన్ వాడీ కేంద్రాల్లోని ఫుడ్ మెనూతో మార్పులు చేసింది ప్రభుత్వం. అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఎగ్ బిర్యానీ అందించనున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. వారానికి రెండు, మూడు సార్లు వడ్డించాలని చెప్పారు.
పిల్లలు ఉల్లాసంగా గడిపేలా 57 రకాల ఆటవస్తువులను అంగన్ వాడీ కేంద్రాల్లో అందుబాటులో పెడతామని తెలిపారు. అంగన్వాడి టీచర్లు హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ మూలంగా కాస్త ఆలస్యమైందని, త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. అంగన్వాడి టీచర్లు ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ స్థానంలో అధునాతన మొబైల్స్ ను త్వరలో అందజేస్తామన్నారు.