కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..8 మంది మృతి

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..8 మంది మృతి

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  శిర్పూర్ తాలుకాలోని వాగాడి గ్రామంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా15 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సమాచారం మేరకు ఫ్యాక్టరీలో సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఫ్యాక్టరీలో 100 మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు.