ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కానిస్టేబుల్  సస్పెన్షన్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కానిస్టేబుల్  సస్పెన్షన్

చేర్యాల, వెలుగు: కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌‌లో పని చేస్తున్న కానిస్టేబుల్  కె.రమేశ్ ను సస్పెండ్  చేస్తూ సిద్దిపేట పోలీస్  కమిషనర్ ఎస్.రష్మీ పెరుమాళ్  ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రమేశ్​ను హెడ్‌‌క్వార్టర్స్‌‌లో డ్యూటీకి హాజరుకావాలని ఆదేశించినప్పటికీ, అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు విచారణలో తేలిందన్నారు.

విధులకు గైర్హాజరైన సమయంలో రమేశ్​ చేర్యాలలో ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. చేర్యాల మున్సిపల్  ఎన్నికల్లో 2వ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న తన భార్యకు మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఉండడంతో రమేశ్​ను సస్పెన్షన్‌‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే కానిస్టేబుల్​ భార్య చేర్యాల అంబేద్కర్​ సెంటర్​లో ఆందోళన చేపట్టింది. తన భర్తను సస్పెండ్​ చేయడం సరైంది కాదని వాపోయింది.