పోస్టల్​బ్యాలెట్ ను వినియోగించుకోవాలి : కలెక్టర్ హనుమంతు జెండగే

పోస్టల్​బ్యాలెట్ ను వినియోగించుకోవాలి : కలెక్టర్ హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు: ఎమర్జెన్సీ సేవల్లో కొనసాగుతున్న స్టాఫ్​ పోస్టల్ బ్యాలెట్​ సౌకర్యం వినియోగించుకోవాలని  ఎన్నికల ఆఫీసర్, కలెక్టర్ హనుమంతు జెండగే సూచించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ఆఫీసర్ల మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఫారం12 -డీ  పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్​ కల్పించిందన్నారు. పార్ట్--1లో ఉద్యోగుల సమాచారం, వారి సంతకం,  పార్ట్--2 లో  నోడల్ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుందని చెప్పారు.   శుక్రవారం నుంచి 8వ తేదీలోపు సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు పంపాలని తెలిపారు. ఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెలిసిటేషన్  కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవచ్చని తెలిపారు. మీటింగ్​లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేఖర్ రెడ్డి,  ఆఫీసర్లు  జయకృష్ణ, అశోక్, హుస్సేన్, సత్య ప్రకాశ్, వినోద్,  వెంకటేశ్వరరావు ఉన్నారు.  

ALSO READ : బీజేపీ మూడో​లిస్టులో ఆరుగురు కన్ఫాం