
- రిటర్నింగ్ ఆఫీసర్పై సీఈసీకి కంప్లయింట్ చేస్తం
- పటాన్చెరు కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్
రామచంద్రాపురం, వెలుగు: ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, తమ ఏజెంట్లను డైవర్ట్ చేసి ఫలితాలను గోల్మాల్ చేసి అవకతవకలకు పాల్పడ్డారని పటాన్ చెరు కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఏకపక్ష నిర్ణయంతో బీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించాడని మండిపడ్డారు. సోమవారం రామచంద్రాపురంలో మాట్లాడుతూ ఎక్కడైనా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ముందుగా లేదా చివరలో లెక్కిస్తారని, కానీ పటాన్చెరులో మాత్రం బ్యాలెట్ ఓట్లను మధ్యలో లెక్కించి తమ ఏజెంట్లను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. 12 నుంచి 18 రౌండ్లలోని ఈవీఎం మెషీన్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, కొన్ని సీల్ లేని ఈవీఎంలను మధ్యలో తీసుకొచ్చి బీఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్గా ఫలితాలు వెల్లడించారన్నారు.
ఆ ఆరు రౌండ్ల ఫలితాలను ఇప్పటికీ అధికారులు ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. 70, 198 పోలింగ్బూత్ల ఈవీఎంలలో సమస్యలున్నాయని, వాటిని లెక్కించకుండానే పక్కన పెట్టారని, 12వ రౌండ్ నుంచి ఫలితాలను అధికారికంగా కూడా ప్రకటించలేదన్నారు. రీ కౌంటింగ్ చేయాలని పట్టుబట్టినా పట్టించుకోకుండా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొంందినట్టు సర్టిఫికెట్ ఇచ్చారని, తమ సంతకాలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లకు..అభ్యర్థులకు పోలైన వాటికి మధ్య 1675 ఓట్ల తేడా ఉందని, దీనిపై సెంట్రల్ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు.