
ఎలక్ట్రిక్ ఎస్యూవీ క్యూ8 ఈ–ట్రాన్ను ఈ ఏడాది ఆగస్టు 18 న ఇండియాలో లాంచ్ చేస్తామని ఆడి ప్రకటించింది. ఈ కారులో 114 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. క్యూ8 ఈ–ట్రాన్ ఎస్యూవీ, క్యూ8 ఈ–ట్రాన్ స్పోర్ట్బ్యాక్ రెండు వేరియంట్లలో ఈ కారును తీసుకొస్తున్నారు. ధర సుమారు రూ.1.5 కోట్లుగా ఉండొచ్చు. ప్రస్తుతం ఇండియాలో ఈ–ట్రాన్ 50, 55, స్పోర్ట్బ్యాక్ 55, జీటీ, ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ వంటి ఈవీ మోడళ్లను ఆడి అమ్ముతోంది.