న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టాలకు చేరడంతో ఈ ఏడాది మేలో ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు రికార్డ్ లెవెల్స్కు చేరాయి. ఏప్రిల్తో పోలిస్తే రెండు వేల యూనిట్లు పెరిగి 1,50,796 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. టీవీఎస్ మోటార్ 41,558 బండ్లను అమ్మి ఈ–టూవీలర్ మార్కెట్లో లీడర్గా కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో 37,661 ఎలక్ట్రిక్ టూవీలర్లను అమ్మింది. బజాజ్ ఆటో అమ్మకాలు మే నెలలో 38,012 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏథర్ 27,525 యూనిట్లను, హీరో 18,261 యూనిట్లను విక్రయించాయి.
