హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ వల్ల మన రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీల తరలింపు విషయంలో రైల్వే శాఖ ఎట్టకేలకు దిగొచ్చింది. వలస కార్మికులను తరలించేందుకు ఎమర్జెన్సీ కోటాలో టికెట్లు ఇస్తామని తెలిపింది. సాధారణ రైళ్లకు అదనంగా బోగీలను మాత్రం యాడ్ చేయడం వీలు కాదని హైకోర్టుకు విన్నవించింది. హైకోర్టు ఆదేశాల మేరకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలోనే ఉండిపోయిన 45 మంది బీహార్ కూలీలను బుధవారమే పంపిస్తామని, వారికి ఎమర్జెన్సీ కోటాలో టికెట్లు ఇస్తామని హైకోర్టుకు తెలియజేశారు. 34 మందిని స్లీపర్ క్లాస్లో, మిగిలిన వాళ్లను ఏసీ బోగీల్లో పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. వలస కూలీలను తరలించేందుకు రెగ్యులర్ రైళ్లకు ఒక్క బోగీ యాడ్ చేయలేరా? అని హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడంతో డీఆర్ఎం ఈ ప్రపోజల్ చేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్సేన్రెడ్డిల డివిజన్ బెంచ్ టికెట్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలించాలని ప్రొఫెసర్ రామశంకర్ నారాయణ మేల్కొటి, లాయర్ పీవీ కృష్ణయ్య, మానవ హక్కుల వేదిక ప్రతినిధి జీవన్ కుమార్ ఫైల్ చేసిన పిల్స్ ను బెంచ్ విచారించింది.
కూలీలకు ఎమర్జెన్సీ టికెట్లు ఇస్తం
- హైదరాబాద్
- June 24, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
- చాలెంజ్ చేసే వాళ్లు రాజీనామాలతో సిద్ధంగా ఉండండి : పొన్నం ప్రభాకర్
- కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఉపాధి కూలీలకు రూ.400 : విజయ రమణారావు
- CRPF క్యాంప్లపై కుకీల దాడి.. ఇద్దరు సిబ్బంది మృతి
- కూసుమంచిలో రైల్వే లైన్ సర్వేను అడ్డుకున్న రైతులు
- గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు : వివేక్ వెంకటస్వామి
- తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ : రాజగోపాల్ రెడ్డి
- కాంగ్రెస్లో చేరిన ఎడవల్లి కృష్ణ
- మఠంపల్లిలో ఎడ్ల బండలాగు పోటీలు షురూ..
- భద్రాచలం ట్రైబల్ బీఎడ్ కాలేజీ లెక్చరర్లకు డెమో క్లాసులు
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?