ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తారీఖీన జీతాలియ్యలె : కూనంనేని సాంబశివరావు

ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు  ఒకటో తారీఖీన జీతాలియ్యలె : కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ధనిక రాష్ట్రమంటూ గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్​గవర్నమెంట్​ తమ హయాంలో ఉద్యోగులకు ఒకటో తారీఖీన జీతాలియ్యలేని దుస్థితిలో కొట్టుమిట్టాడిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. చుంచుపల్లి మండలంలోని పీఆర్టీయూ ఆఫీస్​లో శుక్రవారం ఎమ్మెల్యేను టీచర్లు సన్మానించారు.

ఈ సందర్భంగా పీఆర్టీయూ నేతలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలిచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. నిలిచిపోయిన ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్స్​ తిరిగి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీకి కృషి చేయాలన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గొప్పలకు పోయిన గత బీఆర్ఎస్​గవర్నమెంట్​రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. ప్రోగ్రామ్​లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.వెంకటేశ్వరరావు, బానోత్​రవి, యూనియన్​నేతలు, టీచర్లు పాల్గొన్నారు.