- సుక్మా జిల్లాలో సంఘటన
బీజాపూర్: సుక్మా జిల్లా కుందేడ్ సమీపంలో భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇవాళ ఉదయం 8.30 గంటల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. దంతేవాడ, సుక్మా నుంచి భారీ ఎత్తున బయల్దేరిన భద్రతాబలగాలు కుందేడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ఏఎస్సై రామురాం సింగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్స్ కుంజమ్ జోగా, వంజం భీమా మృతి చెందినట్టు తెలుస్తోంది.