పుల్వామాలో ఎన్‌కౌంటర్:ముగ్గురు హిజ్బుల్ టెర్రరిస్టులు హతం

పుల్వామాలో ఎన్‌కౌంటర్:ముగ్గురు హిజ్బుల్ టెర్రరిస్టులు హతం

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సైన్యంతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్స్ ఉన్నారన్న సమాచారంతో.. అవంతిపొరా ఏరియాలోని పంజ్ గామ్ లో ఈ ఉదయం భద్రతాబలగాలు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. మిలిటెంట్లు ఫైర్ చేయడంతో.. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆయుధాలు, బాంబులను భద్రతా సిబ్బంది సీజ్ చేశారు.

ఈ ఉగ్రవాదులను షౌకత్ దార్, ఇర్ఫాన్ వార్, ముజఫర్ షేక్ గా గుర్తించారు అధికారులు. హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన టెర్రరిస్టులుగా వారిని గుర్తించారు. వారిపై ఉగ్రవాద కేసులు ఇప్పటికే నమోదై ఉన్నట్టుగా తెలిపారు.