ఎన్ కౌంటర్ చేయడం సరైన శిక్షే: వికాస్ దూబే భార్య

ఎన్ కౌంటర్ చేయడం సరైన శిక్షే: వికాస్ దూబే భార్య

ఉత్తరప్రదేశ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే ను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపడంపై కుటుంబ సభ్యులు స్పందించారు.  వికాస్ దూబేను ఎన్ కౌంటర్ చేయడం సరైందేనని ఆయన భార్య రిచా అన్నారు. తన భర్త ఘోరానికి పాల్పడ్డాడని, ఇలాంటి శిక్షకు అర్హుడేనని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య వికాస్ దూబే అంత్యక్రియలు కాన్పూర్ లోని భైరవ్ ఘాట్ లో నిర్వహించగా, భార్య, చిన్న కుమారుడు, బావమరిది దినేశ్ తివారీ తప్ప ఇతర కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు.

తండ్రి రామ్ కుమార్ దూబే కూడా కుమారుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నిరాకరించారు. తన కుమారుడు ఎనిమిది మంది పోలీసులను చంపాడని, తద్వారా క్షమించరాని నేరం చేశాడన్నారు. పెద్దల మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్పష్టం చేశారు. మొదటి నుంచి వికాస్ దూబే కారణంగా తమ పూర్వీకుల ఆస్తి మొత్తం హరించుకుపోయిందని… ఈ శిక్ష సరైనదేనని అన్నారు. నేర ప్రవృత్తిని ఎంచుకున్నవాళ్లకు ఈ ఎన్ కౌంటర్ ఓ కనువిప్పు కావాలని రామ్ కుమార్ దూబే కోరుకున్నారు.