అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ప్రమాదంలో దెబ్బతిన్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఇంజనీర్లు రిపేర్ చేశారు. ముంబయి సెంట్రల్ -- గాంధీనగర్ మధ్య ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నిన్న గురువారం ప్రమాదానికి గురైంది. ఉదయం 11.15 గంటల సమయంలో రైలు పట్టాలపైకి గేదెలు వచ్చాయి. వేగంగా వస్తున్న రైలును సడెన్ బ్రేక్ వేసి ఆపేలోపే రైలు గేదెలను ఢీ కొట్టింది. ప్రమాదంలో రైలు ఇంజిన్ ముందు భాగం దెబ్బతిన్నది. దీంతో రైలు ఇంజన్ కు ఇంజనీర్లు కొన్ని గంటల వ్యవధిలోనే మరమ్మతులు చేశారు.